యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దూర విద్యా విధానంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. హోటల్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్ కోర్సులను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి తొలగించింది. 219-20 విద్యా సంవత్సరం నుంచి కులినరీ స్టడీస్, హోటెల్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్ మదింపుల కోర్సులు దూర విద్యలో చేసేందుకు వీలు లేదని యూజీసీ తేల్చి చెప్పింది. ఇప్పటికే ఓపెన్, డిస్టెన్స్ డ్రిగ్రీలలో ప్రవేశం పొందిన వారికి మాత్రం గుర్తింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కోర్సుల పట్ల క్షుణ్నమైన అవగాహన లేకపోతే.. వృత్తిని సక్రమంగా నిర్వర్తించలేరు కనుక ఈ కోర్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ స్పష్టం చేసింది.