ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బార్ల లైసెన్సులకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండేళ్ల పాటు లైసెన్సులకు అనుమతిస్తూ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. జనవరి 1 నుంచి 2021 డిసెంబర్ వరకు వర్థించేలా లైసెన్సులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ నగర పంచాయతీలు యూనిట్ గా బార్లను కేటాయించారు. కార్పొరేషన్ లో దరఖాస్తు ఫీజు రూ.4.50లక్షలుగా నిర్ణయించింది. మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో రూ.2లక్షలుగా నిర్ణయించింది. విజయవాడ, విశాఖలో బార్ దరఖాస్తుకు ఫీజు రూ.7లక్షలుగా నిర్ణయం తీసుకుంది. ఏడాదికి లైసెన్స్ ఫీజు రూ.5లక్షలుగా సర్కార్ నిర్ధారించింది. వచ్చే నెల 6వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనుంది. డిసెంబర్ 7వతేదీ మధ్యాహ్నం 2గంటలకు కలెక్టర్లు లాటరీ తీయనున్నారు. అదే రోజు రాత్రి 7గంటలకు బార్ల కేటాయింపు జాబితా విడుదల కానుంది.