న్యూఢిల్లి : మహారాష్ట్రలో శివసేన-ఎన్సిపి-కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకోవడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రజాస్వామ్యంలో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే రాజకీయ పార్టీలకు ఉన్న హక్కును తాము తొలగించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.