భారత న్యాయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన తీర్పులను వెలువరించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నేడు తన చివరి పనిదినాన్ని ప్రత్యేకంగా ముగించారు. అయోధ్య భూ వివాదంపై ఆయన నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన సంచలనం సృష్టించింది. ఈనెల 17 వ తేదీన రంజన్ గోగోయ్ పదవీవిరమణ చేస్తూ తన చివరి పనిదినాన్ని శుక్రవారం ప్రత్యేకంగా ఎంచుకున్నారు. గోగోయ్ పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సా 4 గం.లకు వీడ్కోలు పలుకుతూ ప్రత్యేక సభ నిర్వహించింది. రంజన్ గోగోయ్ స్థానంలో ఈ నెల 17 న భారత సర్వోన్నత న్యాయమూర్తిగా మహారాష్ట్రకు చెందిన జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే (63) బాధ్యతలు చేపట్టనున్న విషయం విదితమే..