ఏపీలో హనీ ట్రాప్ గ్యాంగ్ గుట్టు రట్టయింది. యువతిని ఎరగా వేసి.. అనంతరం సన్నిహితంగా ఉన్న వీడియో రికార్డ్ చేసి.. వాటితో బ్లాక్ మెయిల్ చేసే ముఠాను సామర్లకోట పోలీసులు పట్టుకున్నారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రాకేష్ అనే వ్యక్తి తన భార్య అశ్వినీతో గొల్లలలమామిడాడకు చెందిన మణికంఠ రెడ్డికి ఎర వేశాడు. అతడితో పరిచయం పెంచుకునేలా ప్లాన్ చేశారు. ఇక వారిద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు ముఠాకు చెందిన కొందరు వ్యక్తులు వీడియో తీశారు. అనంతరం నగ్న వీడియోలను చూపించి మణికంఠ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేశారు.
ఈ క్రమంలో మణికంఠను కిడ్నాప్ చేసిన ముఠా, అతడి వద్ద నుంచి రూ.63వేల రూపాయల విలువైన బంగారం ఆభవరణాలు చోరీ చేశారు. జరిగిన ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దగారు. పక్కాగా స్కెచ్ వేసి హని ట్రాప్ ముఠాను అరెస్ట్ చేశారు. రాకేష్తో పాటు అతడి భార్య అశ్వినికి సహకరించిన మరో ఏడుగురిరి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ముఠా నాయకుడు, ప్రధాన సూత్రధారి దుర్గారెడ్డి పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, పట్టుబడిన వ్యక్తులంతా కాకినాడకు చెందినవారని తెలిపారు.