న్యూఢిల్లి : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కోర్టు ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాహుల్ క్షమాపణలను కోర్టు అంగీకరించింది. ఇకపై ఇటువంటి వ్యాఖ్యలను చేయవద్దని సుప్రీంకోర్టు రాహుల్ను మందలించింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలు సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. చౌకీదార్ చోర్ హై అన్న వ్యాఖ్యలను తమకు ఆపాదించడం దురదృష్టకరమని కోర్టు పేర్కొంది.