ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా సీఎస్ గా నీలం సహానీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2019, 12:22 PM

నవ్యాంధ్రప్రదేశ్‌ తొలి మహి ళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు బుధవా రం ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించి ప్రభు త్వం జీవో నెం.2563ను జారీ చేసింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, ఎంపవర్‌మెంట్‌ కార్యదర్శిగా పనిచేసిన ఆమె నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 1984వ ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆమె గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మచిలీపట్నంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. అలాగే టెక్కలి సబ్‌కలెక్టర్‌గా, నల్గొండ జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేశారు. అదే విధంగా మున్సిపల్‌ పరిపాలన శాఖ డిప్యూటి సెక్రటరీగా, హైదరాబాదులో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీగాను ప నిచేశారు. అలాగే నిజామాబాదు జిల్లా పీడీ డీఆర్డీ ఏ గాను, ఖమ్మం జి ల్లాల్లో కూడా (సీఏ డీఏ) అడ్మిని స్ట్రేటర్‌గాను విధులు నిర్వహించారు. తదు పరి ఇంధన శాఖలో సం యుక్త కార్యదర్శిగా, నల్గొండ జిల్లా కలెక్టర్‌గాను, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా, టీఆర్‌ అండ్‌బీ కార్యదర్శిగా పనిచేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో సతీనాయర్‌, మిన్నీ మాధ్యూలు మహిళాప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేయగా నవ్యాంధ్ర ప్రదేశ్‌కు తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ బాధ్యతలు చేపట్టనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com