వ్యవసాయానికి సౌర విద్యుత్ను యూనిట్ రూ.3కే అందిస్తామంటూ అంతర్జాతీయ సంస్థ ద ఎనర్జీ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్(తెరి) ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అజయ్ మాధుర్ ప్రతిపాదించారు. ఏపీ ప్రభుత్వం ముందుకు వస్తే ఈ రాష్ట్రంలో ప్రయోగాత్మక పథకంగా దీనిని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యుత్ పొదుపుపై ముంబైలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ‘ఇన్స్పైర్-2019’ వేదికపై ఆయన ఈ ప్రకటన చేశారు.