ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు క్యాబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 12:18 PM

నేడు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ క్రింది అంశాలు చర్చించే అవకాశం ఉంది. ఏపీ మైనర్ మినరల్స్ కన్సెషన్ రూల్స్ లో సవరణలకు ఆమోదం క్యాబినెట్ తెలపనుంది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై భారీగా జరిమానా, జైలు శిక్ష వేసేలా చట్టంలో సవరణలు చేయనున్నారు. ఈ నెల 14 నుంచి జరుప తలపెట్టిన ఇసుక వారోత్సవాలు నిర్వహణపై క్యాబినెట్ లో చర్చించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం అమలుకు ఆమోదం తెలపనున్నారు. ఏపీ కాలుష్య నిర్వహణ సంస్థ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. పట్టణాల్లో అక్రమ లేఅవుట్ల క్రమబద్దీకరణపై చర్చించనున్నారు. గ్రామ న్యాయాలయాల ఏర్పాటు, న్యావాదులకు సంక్షేమ నిధిపై చర్చించనున్నారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు 10 లక్షల ఆర్థిక సాయం ఇచ్చేందుకు ఆమోదం తెలపనున్నారు. సింగపూర్ తో స్టార్టప్ ఏరియా రద్దుకు ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ భూముల అమ్మకాలు, బిల్డ్ ఏపీ పై చర్చించనున్నారు. చంద్రబాబు ఇసుక దీక్ష, రాజకీయ విమర్శలపైనా క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com