ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందన కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి నిర్మూనకు చిత్తశుద్ధితో పని చేస్తున్న విషయాన్ని అంతా గమనించాలని సీఎం జగన్ అన్నారు. రెండు, మూడు వారాలల్లో ఏసీబీని రంగంలోకి దించుతామని సీఎం హెచ్చరించారు. అధికారమనేది చెలాయించేందుకు కాదని... సేవ చేయడానికి మాత్రమే అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. తన దగ్గర ఉండే అధికారుల నుంచి కింది స్థాయి అధికారి వరకూ గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల మీద అథారిటీ చెలాయించేందుకు మనం లేమన్న సీఎం జగన్... మన పబ్లిక్ సర్వెంట్లమని మర్చిపోవద్దని అధికారులకు వివరించారు.
అవినీతిపై పోరాటాన్ని అగ్రెసివ్గా తీసుకోవాలని... అవినీతికి చోటు లేదన్న విషయం కింది స్థాయి అధికారులకు చేరాలని అన్నారు. వచ్చే రెండు మూడు వారాల్లో పెద్ద ఎత్తున ఏసీబీని దించుతున్నామని సీఎం జగన్ అన్నారు. ఏసీబీ చాలా చురుగ్గా పని చేస్తుందని... స్పందనలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత కోసం ఆరు జిల్లాల్లో శిక్షణ, అవగాహన కార్యక్రమాలు పూర్తయ్యాయని ఏపీ సీఎం జగన్ తెలిపారు.