హైదరాబాద్: ఉగ్రవాద నిర్మూనల కోసం భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని కశ్మీర్లో పర్యటిస్తున్న యురోపియన్ యూనియన్ నేతలు అన్నారు. ఈయూ బృందం ఇవాళ మీడియాతో మాట్లాడింది. భారత్కు తాము స్నేహితులమన్నారు. శాంతి కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇస్తామన్నారు. కశ్మీర్లో పర్యటించిన ఈయూ బృందంలో ఓ ఎంపీ.. స్థానిక ఎంపీలకు కూడా కశ్మీర్లో టూర్ చేసే అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత రాజకీయాల్లో జోక్యం చేసుకునేందుకు తామిక్కడికి రాలేదన్నారు. మంగళవారం ఆ బృందం శ్రీనగర్లోని దాల్ సరస్సులో విహరించింది. కశ్మీర్లో వాస్తవాలను తెలుసుకునేందుకు తాము పర్యటిస్తున్నట్లు చెప్పారు. ఈయూ ఎంపీలు శ్రీనగర్లో బుల్లెట్ప్రూఫ్ వాహనాల్లో టూర్ చేశారు.