ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేదార్‌నాథ్‌ ఆలయం మూసివేత

national |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2019, 04:32 PM

ఉత్తరకాశి :  హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న కేదర్‌ నాథ్‌ ఆలయాన్ని నేడు మూసివేశారు. శీతాకాలంలో ఈ ఆలయాన్ని మూసివేయడం ఆచారంగా వస్తున్నది. ఇక్కడి శివుడి విగ్రహాన్ని పూలతో అలంకరించిన పల్లకిలో ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్‌ ఆలయానికి తరలించారు. వచ్చే ఆరునెలలపాటు శివుడికి అక్కడ అర్చనలు చేస్తారు. కేదార్‌నాథ్‌ ఆలయం తలుపులు మూసివేసే కార్యక్రమంలో సుమారు 1200 మంది భక్తులు పాల్గొన్నారని ఆలయ కమిటీ వర్గాలు పేర్కొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com