ఉత్తరకాశి : హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న కేదర్ నాథ్ ఆలయాన్ని నేడు మూసివేశారు. శీతాకాలంలో ఈ ఆలయాన్ని మూసివేయడం ఆచారంగా వస్తున్నది. ఇక్కడి శివుడి విగ్రహాన్ని పూలతో అలంకరించిన పల్లకిలో ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తరలించారు. వచ్చే ఆరునెలలపాటు శివుడికి అక్కడ అర్చనలు చేస్తారు. కేదార్నాథ్ ఆలయం తలుపులు మూసివేసే కార్యక్రమంలో సుమారు 1200 మంది భక్తులు పాల్గొన్నారని ఆలయ కమిటీ వర్గాలు పేర్కొన్నాయి.