ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధానిని అడవిగా మార్చిన జగన్ : కళా వెంకట్రావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 29, 2019, 04:11 PM

సీఎం జగన్ రాష్ట్ర రాజధాని అమరావతిని అడవిగా మార్చారని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ… రోజుకోమాట పూటకోబాట తరహాలో వైకాపా నేతల వ్యాఖ్యలున్నాయన్నారు. ఆర్థిక సంస్థల నుంచి అమరావతికి వచ్చే నిధులకు తూట్లు పొడిచారన్నారు. 5కోట్ల ఆంధ్రులపై, అమరావతికి భూములిచ్చిన రైతులపై కక్ష ఎందుకు అని ప్రశ్నించారు. అమరావతిలో నిర్మాణ వ్యయం పెరుగుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. జె ట్యాక్స్ కోసమే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. హైదరాబాద్ లో తన, తన వాళ్ల భూముల ధరలు పెంచుకోవడం వారి అజెండా అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com