మూడు వన్డేల సిరీస్లో భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గుయానా వేదికగా జరగ్సాల్సిన మొదటి వన్డే వర్షార్పణం కాగా, ఇదే వేదికలో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. దీంతో ఇప్పుడు ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను దక్కించుకోవాలని కోహ్లీసేన కసరత్తు చేస్తుండగా.. ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్ను సమం చేయాలని కరేబియన్లు భావిస్తున్నారు. ఈ మ్యాచ్లో టీం ఇండియా ఒక మార్పు చేసింది. కుల్దీప్ యాదవ్ స్థానంలో యుజవేంద్ర చాహల్ను జట్టులోకి తీసుకుంది. మరోవైపు విండీస్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. షెల్డన్ కొట్రెల్ స్థానంలో కీమో పాల్, ఓషెన్ థామస్ స్థానంలో ఫాబైన్ అలెన్ జట్టులోకి వచ్చారు.