తిరుమల తిరుపతి దేవస్థానం దేవగుడి పల్లికి చెందిన శశాంక్ రెడ్డి అనే భక్తుడికి పంపిణీ చేసిన లడ్డు ప్రసాదంలో గుండుసూది రావడంతో భక్తులు అవాక్కయ్యారు. భక్తులు లడ్డు ప్రసాదం తయారీలో నాణ్యత లోపిస్తుందని, గుండుసూది వచ్చిన విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అధికారులు, లడ్డు తయారీ కాంట్రాక్టర్ పై మండిపడ్డారు.