ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జెండా వందనం చేసే మంత్రుల జాబితా ఖరారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2019, 05:43 PM

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక వచ్చిన మొదటి స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో.. ఆ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మున్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు. ఆగస్టు 15న జిల్లాల్లో జెండా వందనం చేసే మంత్రుల జాబితాను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ వివరాల ప్రకారం కృష్ణా జిల్లా- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, శ్రీకాకుళం- మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, విజయనగరం- డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, విశాఖపట్నం- మంత్రి మోపిదేవి, తూర్పుగోదావరి -డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పశ్చిమ గోదావరి-డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, గుంటూరు- మంత్రి పేర్ని నాని, ప్రకాశం- మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, నెల్లూరు- మంత్రి సుచరిత, కర్నూల్‌- మంత్రి బొత్స సత్యనారాయణ, కడప -డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, అనంతపురం - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు-డిప్యూటీ సీఎం నారాయణ స్వామి లు జెండాలు ఎగురవయనున్నారు.



 


 


 








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com