కర్నాటకలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజ్ భవన్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బిఎస్ యడియూరప్ప నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వాజుభాయి వాలా యడియూరప్పతో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. అనంతరం ఆయనకు గవర్నర్ అభినందనలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.