తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయమని, కాంగ్రెస్ పరిస్థితి అత్యంత ఘోరంగా తయారైందనంటూ విమర్శలు జడివాన కురిపించిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డకి షోకాజ్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్దమైనట్టు సమాచారం. గత కొంత కాలంగా ఉత్తమ్ కుమార్ నేతృత్వంలోని పార్టీ రాష్ట్ర నాయకత్వం తప్పుడు నిర్ణయాలను తీసుకోవటం వల్లనే తెలంగాణలో పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చిందని ఆయన నిప్పులు చెరగుతున్నారు.. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అత్యంత దురదృష్టకరమని, కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేకుండా చేసారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బిజెపిలో కోమటి రెడ్డి బ్రదర్స్తో పాటు రేవంత్ రెడ్డి, సీతక్క తదితరులు చేరుతారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన జగ్గారెడ్డితో మాట్లాడటంతో ఇప్పటికే 12 మందిశాసనసభ్యులు టిఆర్ ఎస్లో చేరిపోగా మిగిలిన ఆరుగురులో ఇద్దరు బిజెపి పంచన చేరితే నలుగురు మాత్రమే కాంగ్రెస్ వైపు ఉంటారా? ఊడతారా అన్నది ప్రశ్నార్ధకమే. కాగా తను. బీజేపీలో చేరే అంశంపై కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని కోమటి రెడ్డి తెలిపారు.