ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామనగర పోలింగ్ కేంద్రంలో ఓటేసిన కుమారస్వామి

national |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2019, 11:49 AM

కర్ణాటక: రామనగర పోలింగ్ కేంద్రంలో తమ కుటుంబసభ్యులతో పాటు సీఎం కుమారస్వామి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా.. కర్నాటకలో 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా రెండో దశ లోక్‌సభ పోలింగ్ ప్రారంభమైంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 95 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా.. 1644 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వాస్తవానికి 97 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉన్నా.. వెల్లూరులో పోలింగ్ రద్దైంది. మరో నియోజక వర్గం త్రిపురలో తూర్పులో మూడో దశ అంటే ఈ నెల 23 పోలింగ్ నిర్వహిస్తారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com