వైసీపీ అరాచకాలను, బీజేపీ తప్పుడు పనులను ఎండగట్టామని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ గెలుపును అడ్డుకోవడానికి చేసిన కుట్రలను ప్రజలే అడ్డుకున్నారన్నారు. సకాలంలో స్పందించి ఓట్ల తొలగింపు కుట్రలను భగ్నం చేశామని చంద్రబాబు తెలిపారు. పోలింగ్ రోజు ఉదయాన్నే ఈవీఎంలు మొరాయించేలా చేశారన్నారు. భాస్కర్ రెడ్డి హత్య, స్పీకర్ పై దాడి, మహిళా అభ్యర్థులపైన దౌర్జన్యాలు చేశారన్నారు. తప్పులు చేసి ప్రజా తీర్పు కాలరాయాలని చూశారన్నారు.