కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. బిజెపి ఎంపి మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో రాహుల్కు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. రాఫెల్ డీల్పై చౌకీదార్ చోర్ హై అంటూ సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొందని రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై ఈ నెల 22వ తేదీలోగా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు రాహుల్ ఆదేశించింది.