చండీగఢ్ : లోక్సభ ఎన్నికల్లో తాము బిజెపితో పొత్తు పెట్టుకోవడం లేదని ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డి) స్పష్టం చేసింది. ఐఎన్ఎల్డి నాయకుడు అభయ్ సింగ్ చౌతాలా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్తో సమావేశమైన తరువాత ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. ఐఎన్ఎల్డి హర్యానా శాఖ అధ్యక్షుడు అశోక్ అరోరా మాట్లాడుతూ బిజెపి ఇప్పటికే 8 మంది అభ్యర్థులను ప్రకటించిందని, తాము త్వరలో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.