న్యూఢిల్లి : ఇన్కంటాక్స్ (ఐటి) అధికారులు చేస్తున్న దాడుల విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఐటి దాడులు ఇవాళ కొత్తగా ప్రారంభమైనవి కాదని, ఎన్నో ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయని ఆయన అన్నారు. ఎవరి ఆదేశాలతోనే దాడులు జరుగుతున్నాయనడం అన్యాయమని ఆయన అన్నారు. ఎలక్షన్ కమిషన్ బలగాలను కోరిందని, తాము పంపించామని ఆయన చెప్పారు.