ఇంద్రకీలాద్రి కొలువుదీరిన కనకదుర్గమ్మను నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. సీఎస్కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సతీ సమేతంగా ఆలయానికి వచ్చిన ఆయన ఉగాది సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనాంతరం సీఎస్కు ఈవో కోటేశ్వరమ్మ దుర్గమ్మ చిత్ర పటంతో పాటు ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉగాది రోజున అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నానని సీఎస్ తెలిపారు. తనకు అమ్మవారు మంచి అవకాశం కల్పించారని, ప్రజలు అన్ని రకాలుగా సంతోషంగా ఉండే విధంగా పని చేస్తానని ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు.