అధికారంలోకి వస్తే ఏపీలో జిల్లాలను 25కు పెంచుతామని హమీ ఇచ్చారు వైఎస్ జగన్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చనున్నట్లు వెల్లడించారు. పరిపాలనను ప్రజల దగ్గరకు తీసుకెళ్లేందుకు.. త్వరితగతిన పరిష్కారం లభించేందుకు ఈ హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆరు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని.. దీని వల్ల పరిపాలన సౌలభ్యం కోసం ఈ హామీ ఇస్తున్నట్లు వెల్లడించారు.
జగన్ ప్రభుత్వం వస్తే ఏపీలో కొత్త జిల్లాలు ఇవే :
1. అరకు 2. శ్రీకాకుళం 3. విజయనగరం 4. విశాఖపట్నం 5. అనకాపల్లి 6. కాకినాడ 7. అమలాపురం 8. రాజమండ్రి 9. నరసాపురం 10. ఏలూరు 11. మచిలీపట్నం 12. విజయవాడ 13. గుంటూరు 14. నరసరావుపేట 15. బాపట్ల 16. ఒంగోలు 17. నంద్యాల 18. కర్నూలు 19. అనంతపురం 20. హిందూపూర్ 21. కడప 22. నెల్లూరు 23. తిరుపతి 24. రాజంపేట 25. చిత్తూరు