బీజేపీ ఎంపీ హేమా మాలిని ఇవాళ ట్రాక్టర్ నడిపారు. యూపీలోని మథుర లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. గోవర్దన్లో ఇవాళ హేమామాలిని రైతులతో ముచ్చటించారు. ఆ తర్వాత ఆమె ట్రాక్టర్ నడిపారు. కొన్ని రోజుల క్రితం ఇదే పట్టణంలో.. గోధమ పంటను కూడా కోశారు. చేతిలో కొడవలి పట్టి ఆమె పంటను కోసిన విషయం తెలిసిందే. నియోజకవర్గ ప్రజలను ఎన్నికల వేళ చేరువ చేసుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో కూడా హేమమాలిని ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఇక్కడి ప్రజలు తనను స్వాగతిస్తున్నారని, అందుకు తాను గర్వపడుతున్నానని ఆమె పేర్కొన్నారు.