ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 05, 2019, 04:36 PM

ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ను వదిలి అమ‌రావ‌తి పారిపోయి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ అని సినీ నటుడు, వైఎస్ ఆర్‌సీపీ నేత మంచు మోహన్‌బాబు విమర్శించారు. అలాంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతేనంటూ ధ్వజమెత్తారు. భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన‌ మోహన్‌బాబు.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. 


ఎవ‌రినో కాకుండా నిత్యం అందుబాటులో ఉండే గ్రంధి శ్రీనివాస్‌ను ఎమ్మెల్యేగా, కనుమూరు రఘురామ కృష్ణంరాజును ఎంపీగా గెలిపించుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయన్నారు. సినిమాలు వేరు.. రాజకీయం వేరని ప్ర‌జ‌లు ఈ విష‌యాన్ని గమనించాలన్నారు. రాష్ట్రంలో కులపిచ్చిని రాజేసిన చంద్రబాబు పత్రికలు, టీవీలను తన చేతిలో పెట్టుకుని భజన చేయించుకుంటున్నాడని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 


నిత్యం జగన్‌పై కేసుల గురించి మాట్లాడే చంద్రబాబు తనపై ఉన్న కేసులు సంగతేమిటో ప్రజలకు చెబితే బాగుంటుందని డిమాండ్ చేశారు. ఆయన చుట్టూ ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఇసుక, మట్టి మాఫియాతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిప‌డ్డారు. గత ఐదేండ్లుగా చంద్రబాబు ప్రజలకు ఏం చేశాడో చెప్పడం లేదని మోహన్‌బాబు విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com