ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబిత ఈనెల 20న విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. పసుపు - కుంకుమ కింద ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కులపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. వీవీ ప్యాట్స్ స్లిప్ లను నియోజకవర్గంలోని ఒక్క బూత్ ఓట్లు మాత్రమే లెక్కిస్తామని స్పష్టం చేశారు.యువ ఓటర్లును పెంపుదల కోసం కాలేజీల క్యాంపస్ లో అవగహన సదస్సులు నిర్వహిస్తాం. క్యూ లైన్ లు తగ్గించడానికి టోకెన్ సిస్టం ఈ ఎన్నికలలో అమలు చేయబోతున్నామన్నారు. 350 కంపెనీల పారా మిలిటరీ బలగాలను రాష్ట్రానికి పంపిచాల్సిందిగా పోలిస్ శాఖ కోరింది. 2019 ఎన్నికల నిర్వహణ కోసం 3 లక్షల ఉద్యోగుల సేవలు వినియోగించు కుంటున్నామన్నారు.