దేశపు మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ట్రెయిన్ 'వందే భారత్ ఎక్స్ప్రెస్'ను ప్రధాని మోడీ శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. రేల్వే మంత్రి పీయూష్గోయల్ నేతృత్వంలోని అధికారులు, మీడియా ప్రతినిధులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద నిర్మించిన ఈ ' వందే భారత్ ఎక్స్ప్రెస్ ' గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తుందని, శతాబ్ది ఎక్స్ప్రెస్ తరహాలోనే అన్ని సదుపాయాలు కల్పించామని అన్నారు. న్యూఢిల్లీలోని కాన్పూర్ నుండి వారణాశి అలహాబాద్ స్టేషన్కు 18 గంటలలో చేరుకుంటుందని, ఈ ట్రెయిన్లో 16 కోచ్లు ఉన్నట్లు తెలిపారు. కాగా, ఈ ట్రెయిన్ను చెన్నైకి చెందిన రైల్వే ప్రొడక్షన్ యూనిట్ తయారు చేసిందని అన్నారు.