యోగా సాధన వల్ల ఏకాగ్రత మరింత పెరుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఆదివారం శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కళాశాల జూబ్లీ హాల్లో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యోగా పోటీలను పారంభించారు. ఈ సందర్భంగా 10 నుంచి 55 వయస్సు గల వారు పోటీల్లో పాల్గొనగా ఆరు కేటగిరిల్లో ట్రెడిషనల్, రిథమిక్, ఆర్టిస్టిక్ విభా గాల్లో 90మంది విజేతలుగా నిలిచారు.గెలుపొందిన క్రీడాకారులు అక్టోబరులో కర్నూలులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ జనరల్ సెకట్రరీ కేదార్నాథ్, జాయింట్ సెక్రటరీ జి.అర్చన, గురు గుబెల్లి జీవిత, ఉపాధ్యక్షులు తంగి స్వాతి, కొంక్యాన మురళీధర్, కోశాఽధికారి శ్రీనివాస రావు, సభ్యులు రమ్య, ప్రిన్సిపాల్ సురేఖ పాల్గొన్నారు.