ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం భరోసాకోసం పాత పెన్షన్ అమలు చేసే తేదీ ప్రక టించాలని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.శ్రీనివాస్ కోరారు. ఆదివారం శ్రీకా కుళంలో ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ పథకాన్ని సమీక్షించి మెరుగైన పింఛన్ విధానాన్ని ప్రవేశ పెడతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎస్వీ రమణమూర్తి, ప్రధాన కార్యదర్శి పి.తమ్మినాయుడు, పి.రామకృష్ణ, రాధాకృష్ణ, రామారావు, జి.రమణ, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.