ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విషయంలో లడ్డూ అంశం క్లైమాక్స్.. నాగబాబు కీలక వ్యాఖ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 07:41 PM

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నిలిచారు మెగా బ్రదర్, జనసేన జాతీయ కార్యదర్శి నాగబాబు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కొంతమంది విమర్శలు చేయడంతో.. నాగబాబు స్పందించారు. ఈ సందర్భంగా నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మం ప్రమాదంలో ఉందనడానికి లడ్డూ అంశమే క్లైమాక్స్‌ లాంటిదని అభిప్రాయపడ్డారు. దేవాలయాలు, ధార్మిక మండళ్లను హిందువులే నిర్వహించాలన్న నాగబాబు.. హిందూ ధర్మ రక్షణ మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సనాతన ధర్మం బతకడం నేర్పిందని.. దానికి అన్యాయం జరుగుతోందనే పవన్ మాట్లాడారని చెప్పారు. పవన్ కళ్యాణ్ సెక్యులర్ అని.. అన్ని మతాలను గౌరవిస్తారని చెప్పారు. పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసేవారు సూడో సెక్యులర్లు అంటూ విమర్శించారు.


ఇక తిరుమల లడ్డూ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని నాగబాబు స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక దోషులెవరున్నా బయటకు వస్తారని హెచ్చరించారు. వైసీపీ ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా రియాక్టయ్యారు. ప్రాయశ్చిత్త దీక్షను కూడా చేపట్టారు. ఇక దీక్షలో భాగంగా ఇటీవల విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు పవన్. సనాతన ధర్మం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మానికి హాని కలిగితే.. ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధమంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు.


తిరుమల లడ్డూ విషయంపై హిందువులు అందరూ కలిసికట్టుగా ఉండాలని పవన్ కళ్యాణ్ అప్పట్లో పిలుపు నిచ్చారు. ఈ విషయంలో మౌనంగా ఉండటం మంచిది కాదని అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీపై వైసీపీ నేతల మాటలు ఆవేదన కలిగిస్తున్నాయన్న పవన్ కళ్యాణ్.. తప్పు ఒప్పుకోకుండా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. దుర్గగుడిలో వెండి రథం సింహాల ప్రతిమలు కనిపించకుండాపోతే వైసీపీ నాయకులు అవహేళన చేశారన్న పవన్ కళ్యాణ్.. ఆ వ్యాఖ్యలు క్రైస్తవులో, ఇంకొకరో చేయలేదని.. చేతులకు తాళ్లు కట్టుకుని బొట్టుపెట్టుకునే హిందువులే మాట్లాడారంటూ విమర్శించారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు రాగా.. నాగబాబు సమర్థించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com