మార్కాపురం పట్టణంలోని వీధుల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని మార్కాపురం డీఎస్పీ యూ. నాగరాజు హెచ్చరించారు. ప్రధాన వీధుల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో సిబ్బందితో కలిసి ఆదివారం డీఎస్పీ నాగరాజు పర్యటించారు. స్థానిక కళాశాల రోడ్డు, మెయిన్ బజార్, రథం బజార్, నాయుడువీధి, దోర్నాల బస్టాండ్, గడియారస్తంభం కూడలి, నెహ్రూబజార్, కంభం రోడ్డు, కోర్టు సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.
ముఖ్యంగా దుకాణాల ముందు ఇష్టారీతిన వాహనాలు నిలిపి ఉంచడంతోనే ఇబ్బందులు ఎదుర వుతున్నట్లు గుర్తించారు. దుకాణదారులకు ఒకటికి రెండుసార్లు హెచ్చ రించి పద్ధతి మార్చుకోకుంటే కేసులు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. నెహ్రూ బజార్, కూరగాయల మార్కెట్కు వెళ్లే ప్రాంతాల్లో వన్వే చేయాలని సూచిం చారు. సరుకు ఎగుమతి, దిగు మతి వాహనాలను నిర్ణీత వేళల్లోనే తిరిగేలా చూడాలని ఆదేశించారు. బస్సులు నిలిపే ప్రదేశాల వద్ద ఆటోలు ఇష్టా రీతిన నిలపడంతో ఇబ్బందులు ఎదురవుతు న్నాయని కొందరు ఆయనకు ఫిర్యాదు చేశారు. ఆటోలు క్రమపద్ధతిలో తిరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు వారికి తెలియజేశారు. కార్యక్రమంలో మార్కాపురం సీఐ పి.సుబ్బారావు, పట్టణ ఎస్సై సైదుబాబులు పాల్గొన్నారు.