ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పారిశ్రామిక రంగం పునరుజ్జీవనం పోసుకుందని టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలన అన్ని రంగాలు భ్రష్టుపట్టుకుపోయాయన్నారు. జగన్ను కానీ, వైసీపీ ప్రభుత్వాన్ని కానీ చూస్తే పారిపోయే పరిస్థతికి జనం వచ్చారన్నారు. యువత కూడా ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పారిశ్రామిక రంగం అన్ని రకాలుగా ఇబ్బంది పడేది అంతా చూశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్కు అనుగుణం పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. రాక్షస పాలన అనంతరం చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నుకున్న రంగం పారిశ్రామిక రంగమే అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సీఎం అయిన వెంటనే జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ పెట్టుబడి పెట్టేందుకు క్యూ కట్టాయన్నారు. దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగానే పాలసీ సిద్ధం చేశారన్నారు. ఈ ఐదేళ్ల పాలనలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆలోచన చేస్తున్నారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు వెల్లడించారు.