ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ సికింద్రాబాద్ వందేభారత్ రైలు షెడ్యూల్ మార్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 09:18 PM

విశాఖపట్నం సికింద్రాబాద్ వందేభారత్ రైలు షెడ్యూల్‌లో మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ రైలు వారంలో ఆరు రోజులు నడుస్తోంది. ఒక్క ఆదివారం మాత్రమే విరామం ఇస్తున్నారు. అయితే ఇకపై మంగళవారం మినహా వారంలో మిగతా ఆరు రోజులు.. విశాఖ సికింద్రాబాద్ వందేభారత్ రైలు రాకపోకలు సాగించనుంది. రైల్వే అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ పదో తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని.. అప్పటి నుంచి విశాఖ సికింద్రాబాద్ వందేభారత్ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలియజేశారు.


మరోవైపు విశాఖపట్నం నుంచి ఉదయం 5 గంటల 45 నిమిషాలకు ప్రారంభం కానున్న వైజాగ్ సికింద్రాబాద్ వందేభారత్ రైలు.. మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మొత్తం ఐదు స్టేషన్‌లలో విశాఖ సికింద్రాబాద్ వందేభారత్ రైలు ఆగనుంది. సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్‌లలో దీనికి స్టాపింగ్ ఇచ్చారు. అయితే ఈ రైలుకు ఉన్న ఆక్యుపెన్సీకి తోడు, ఆదివారం రోజుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆదివారం కూడా రైలు నడపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే డిసెంబర్ పదో తేదీ నుంచి మంగళవారం విశాఖపట్నం సికింద్రాబాద్ వందేభారత్ రైలుకు సెలవు ఇచ్చారు.


ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కాచిగూడ- యశ్వంత్‌పూర్, సికింద్రాబాద్ - విశాఖపట్నం, విశాఖపట్నం - సికింద్రాబాద్ మార్గాల్లో సహా పలు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వందేభారత్ రైళ్లకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైళ్లను కూడా భారతీయ రైల్వే ప్రారంభించనుంది. వందేభారత్ రైళ్లు కేవలం పగటి వేళల్లోనే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దూరప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని రాత్రి వేళ కూడా ప్రయాణం చేసేందుకు వీలుగా వందేభారత్ స్లీపర్ రైళ్లను రూపొందిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com