ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాకు అన్యాయం చెయ్యకండి అంటున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 28, 2024, 07:14 PM

తమ పోస్టులను డీఎస్సీలో కలిపి తమ కుటుంబాలను అంధకారంలోకి నెట్టొద్దని గిరి జన గురుకుల విద్యా లయాల ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం కురు పాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిని గుమ్మలక్ష్మీపురంలోని తన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించా రు. తాము గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో రెగ్యులర్‌ ఉపాధ్యాయు లుగా, పలు రకాల అదనపు ఇన్‌చార్జి విధులు కూడా నిర్వహిస్తున్నామ చెప్పారు. తాము పనిచేస్తున్న పోస్టులు జోనల్‌ స్థాయిలో ఉన్నాయని, ఆయా పోస్టులను డీఎస్సీలో కలిపేందుకు అవకాశం లేదని వివరించారు. త్వరలో జారీ చేయబోయే డీఎస్సీకి ఈ పరిస్థితుల్లో సన్నద్ధం కాలేమని, కాబట్టి తమను ముఖ్యమంత్రి, విద్యా శాఖామంత్రి, గిరిజన సంక్షేమశాఖామంత్రుల దృష్టికి తీసుకెళ్లి తమకు సీఆర్టీలుగా పరిగణించి జీతాలను పెంపుదల చేయాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు తిరుపతిరావు, నాగేశ్వరరావు, గిరిజ, దివాకర్‌, శ్రీనివాసరావు, వెంకటరమణ, బంగారు రాజు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com