విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ పరిధిలో ప్రస్తుతం రోజుకు 600 మంది దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. ఈ సంఖ్య పెరిగితే.. పాస్పోర్టులు జారీచేసే సంఖ్య కూడా పెరుగుతుంది. ఫలితంగా మరిన్ని రికార్డులు నమోదు చేసే వీలుంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ సంవత్సరంలో విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయ పరిధిలో ఈ సంఖ్యను ఇంకా పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు. కార్యాలయాన్ని విస్తరించే దిశగా పనులు చేపడుతున్నారు. మరో నెలలో ఈ పనులు పూర్తి కానున్నాయి. ఇది పూర్తయితే రోజుకు 1,200కు పైగా పాస్పోర్టు దరఖాస్తులను పరిశీలించవచ్చు. దీంతో రెట్టింపు సంఖ్యలో పాస్పోర్టులు జారీచేసే వీలుంటుంది. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి ఆరు లక్షల పాస్పోర్టులను జారీచేసే స్థాయి వస్తుంది. ఇదే జరిగితే ఆల్టైమ్ రికార్డు నమోదవుతుంది.