చీరాల ఎన్ఆర్అండ్ పిఎం హైస్కూల్ ఆవరణలోని సైడ్ కాలువలో పందికొక్కులు, ఎలుకలు చచ్చి దారుణమైన దుర్గంధం వస్తోంది. దీంతో గత వారం రోజులుగా పాఠశాలలకు వెళ్లే పిల్లలు ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. సైడ్ కాలువ కట్టిన వద్ద నుంచి ఇంతవరకు దానిని శుభ్రం చేసిన పాపాన పోలేదనే విమర్శలు వస్తున్నాయి. వాకర్లు, క్రీడాకారులు కూడా ఆ దారినే వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందిస్తారేమో చూడాలి.