బెలుగుప్ప మండలంలోని దుద్దేకుంట గ్రామ సమీపంలో జూద స్థావరంపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని రూ. 25, 190 నగదు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మరి కొందరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. జూద స్థావరం గ్రామానికి చెందిన ఇద్దరు వైకాపా నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు మండలంలో జోరుగా చర్చనడుస్తోంది.