రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్సభ స్థానాలకు గురువారం ఉ.11 గంటల నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నాల్గవ దశ ఎన్నికల్లో భాగంగా మే 13న రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికలకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో శ్రీశైలం వైయస్ఆర్సీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బుడ్డా శేషారెడ్డి, మైనారిటీ నాయకుడు అహ్మద్హుస్సేన్, యూత్ నాయకుడు శిల్పా కార్తీక్రెడ్డి తదితరులు భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.