టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబుకు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పదవి కోసం ఎన్టీఆర్ను గద్దెదించి ఇబ్బంది పెట్టి అధికారంలోకి వచ్చిన పరమ దుర్మార్గుడు చంద్రబాబు అని ఎన్టీ రామారావే అన్నారు. స్వయనా ఎన్టీఆర్ చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ చివరిలో ఎంతగా ఆవేదన చెందారో..కుమిలిపోయారో ప్రజలు గమనించాలి. ఈ ఆవేదనే ఆయన మరణానికి కారణమైంది. ఎన్టీఆర్ చివరి రోజుల్లో పలికిన మాటల వీడియోలను విడుదల చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా?.అని ప్రశ్నించారు.