చిట్వేల్ మండలం రాజుకుంట గ్రామం నందు శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవం లో గురువారం ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పాల్గొని, అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిట్వేలిమండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, సీనియర్ నాయకులు మహేశ్వర్ రెడ్డి, రమణా రెడ్డి, మలిశెట్టి వెంకట రమణ, లింగం లక్ష్మీకర్, లోకేష్, చిన్నా, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.