టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు ప్రతీ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువత పాదయాత్రలో పాల్గొంటున్నారు. పలు సామాజిక వర్గాలు, రైతులు, అనేక సంఘాల ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో లోకేష్ను కలుస్తూ తమ సమస్యలను తెలియజేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వల్ల తాము ఎంత నష్టపోయామో లోకేష్కు తెలియజేస్తున్నారు. వైసీపీ పాలనపై దుమ్మెత్తిపోస్తూ.. ప్రతీ ఒక్కరి పట్ల జగన్ సర్కార్ అన్యాయంగా ప్రవర్తిస్తోంది అంటూ లోకేష్ మండిపడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు తీర్చుతామంటూ హామీ ఇస్తూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు తన కోసం వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగుతున్నారు. ప్రతీరోజు సుమారు వెయ్యి మందితో లోకేష్ సెల్ఫీలు దిగుతున్నారు. తమ అభిమాన నేత ఆప్యాయంగా పలకరిస్తూ సెల్ఫీలు దిగడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మంత్రాలయం నియోజవర్గంల మాధవరం విడిది కేంద్రం నుంచి 82వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. మధ్యాహ్నం మంత్రాలయంలో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో లోకేష్ పాల్గొననున్నారు.