ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాఫిక్ ఫై ప్రత్యేక దృష్టి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2023, 10:39 AM

కర్నూలు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన మంత్రాలయం దర్శనార్థం కర్ణాటక నుండి భక్తులు గురువారం అధిక సంఖ్యలో తరలి రావడంతో శ్రీ మఠంలో భక్తుల రద్దీ పెరిగింది. దీనిలో భాగంగా మంత్రాలయం ఎస్ఐ వేణుగోపాల్ రాజ్ తన సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి కనపరిచారు. కర్ణాటక రాష్ట్రం నుండి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ట్రాఫిక్ నందు ఎలాంటి ఇబ్బందులు కలగరాదని తన సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం వాహనాలను ఆర్టీసీ బస్టాండ్, నాగలదిన్నె రోడ్డు, వాహనాల ను పార్కింగ్ స్థలాలలోనే పార్కింగ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వేణుగోపాల్ రాజ్, టూరిస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సి. వెంకటేశ్వర్లు, పోలీసులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com