ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్యాలయాల భవనాలకు సమస్య లేదు: వై.వీ.సుబ్బారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 11:19 PM

విశాఖ వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారన్నది సమస్య కాదని, అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని టీటీడీ చైర్మన్, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. భీమిలి రోడ్డులో ఖాళీగా ఉన్న ఐటీ కంపెనీలను ప్రభుత్వ భవనాలుగా ఉపయోగించుకుంటామని తెలిపారు. సెక్రటేరియట్ గా వినియోగించుకోదగిన భవనాలు కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయని వైవీ పేర్కొన్నారు. పైగా, ఉడాకు సంబంధించిన భవనాలు కూడా ఉన్నాయని వివరించారు.


ఏపీ రాజధాని విశాఖేనని సీఎం జగన్ ఇవాళ ఢిల్లీలో తమ వైఖరిని బలంగా చాటగా, వైసీపీ నేతలు కూడా ఈ అంశంలో మరింత స్పష్టత నిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఏప్రిల్ లోపు విశాఖకు రాజధాని తరలింపు ఉంటుందని వెల్లడించారు. రాజధాని మార్పుపై తాము విశాఖ గర్జన సభలోనే స్పష్టం చేశామని తెలిపారు. ఏప్రిల్ లోపు న్యాయపరమైన సమస్యలు ఓ కొలిక్కి వస్తాయని భావిస్తున్నామని, విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందని చెప్పారు. 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com