లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లి నందన్ కుమార్ తల్లి నాగేశ్వరి వర్ధంతి సందర్భంగా చిత్తూరు రోడ్డు మార్గంలో భారత్ పెట్రోల్ బంక్ వెనకాల మరియు టివిఎస్ షోరూమ్ పక్కన గుడిసెలలో నివసించే 100 మంది పేదలకు మాంసాహార అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు లయన్ షేక్ మహమ్మద్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి అన్నదానం చెయ్యడం గొప్ప పుణ్య కార్యమని ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ద్వారా నిర్వహిస్తున్నామని పేద ప్రజలకు సహాయం చేసే అవకాశం కలగడం భగవంతుడు మానవులకు ఇచ్చిన గొప్ప వరం అని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ డబ్బులు వృధా చేయకుండా ఇలా ప్రజలకు ఉపయోగపడే సేవ కార్యక్రమాలు చేయాలని కోరారు.