2022-23 సం.కు సంబందించిన వైయస్సార్ చేయూత లబ్దిదారుల, అనర్హుల తుది జాబితా విడుదలైంది. ఈ మేరకు గ్రామ/వార్డు సచివాలయ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సచివాలయ సిబ్బంది యాక్సిస్ చేసే NBM పోర్టల్ లో ఈ జాబితా అందుబాటులో ఉంటుంది. అర్హుల జాబితాను సచివాలయ సిబ్బంది నోటీసు బోర్డులో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ఏడాదికి రూ.18,750 ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది.