రాజస్థాన్ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో లంపీ స్కిన్ వ్యాధి వల్ల 50 వేల పశువులు మరణించాయని, ఇంకా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఇంత వరకూ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటూ జైపూర్ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.