మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నిర్వహించిన సంస్థాగత పర్యం సభ్యత్వ నమోదు కార్యక్రమం బాచుపల్లి లోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్ మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీ కే అరుణ, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ హాజరయ్యారు. అనంతరం గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి వారిని పూలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపి పార్టీ అని సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెనింగ్ నిర్వహించి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మువ్వ జయశ్రీ మాధవి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధా, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ జిల్లా ప్రధాన కార్యదర్శిలు గిరివర్ధన్ రెడ్డి నరహరి తేజ విగ్నేశ్వర్, ఉపాధ్యక్షులు బక్క శంకర్ రెడ్డి గరిగే శేఖర్, డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత, పున్నా రెడ్డి, పత్తి సతీష్, దుర్యోధన, కంది శ్రీరాములు, పులి బలరాం, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.