ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎదగాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. అనంతరం సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీలో "గ్లాండ్ ఫార్మా లిమిటెడ్" ఎండి శ్రీనివాస్ సాధు, మేనేజింగ్ ట్రస్టీ కె. రఘురామన్ సహాయ సహకారాలతో దాదాపు 6.00 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన అన్ని మాలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మరింత మంది దాతలు ముందుకు వచ్చి పాఠశాలను అభివృద్ధి పరిచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినప్పుడే మా కృషికి మంచి ఫలితం దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి హరిశ్చంద్ర, పాఠశాల హెడ్ మాస్టర్ యదగిరి, ఎంఆర్ పి రమేష్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, నాయకులు శివాజీ, రాజ్ కుమార్, కట్టు అశోక్, పందిరి యాదగిరి, గుబ్బల లక్ష్మీ నారాయణ, తారా సింగ్, నరేందర్, తిరుపతి, విజయ్, ఇస్మాయిల్, శ్యామల, దేవి, మంగ తదితరులు పాల్గొన్నారు.